అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు పై ఆధారబడ్డ కుల్భూషణ్ భవితవ్యం
- July 17, 2019గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయుడు కుల్భూషణ్ జాదవ్ భవితవ్యం ఇవాళే తేలనుంది. జాదవ్ కేసులో ఇవాళ అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. కుల్భూషణ్ జాదవ్ తమ దేశంలో గూఢచర్యం చేస్తుంటే పట్టుకున్నామని పాకిస్థాన్ వాదిస్తోన్న అంతకు ముందే తమ దేశ ఆర్మీ కోర్టులో జాదవ్కు ఉరిశిక్ష ఖరారు చేసింది. అయితే, జాదవ్ దుబాయ్లో ఉండగా అరెస్ట్ చేసి పోలీసులు పాకిస్థాన్కు తీసుకెళ్లారని ఆయన కుటుంసభ్యులు వాదిస్తున్నారు. ఇక, పాక్ కోర్టులో జాదవ్కు ఉరిశిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది భారత్. ఈ కేసులో జాదవ్ నేరం చేశాడని పాకిస్థాన్ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అంతర్జాతయ కోర్టు తప్పుబట్టింది. భారత్ తరపున ప్రముఖ న్యాయవాది హరీష్సాల్వే వాదించారు. జాదవ్ను నిర్ధోషిగా విడిపిస్తారా? లేక పాకిస్థాన్ తీర్పును ఖరారు చేస్తారా? అనే విషయం ఇవాళ తేలనుంది. ఈ కేసులో తమకు అనుకూలంగానే తీర్పు వస్తుందని భారత్ భావిస్తోంది.
తాజా వార్తలు
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!