ఇండియన్ టెక్కీలకు గుడ్ న్యూస్ ఇచ్చిన అమెరికా
- July 17, 2019వాషింగ్టన్ : భారత ఐటీ నిపుణులకు శుభవార్త అందింది. గత కొంతకాలంగా వలసల విషయంలో ఆంక్షలు విధిస్తున్న అగ్రరాజ్యం గ్రీన్ కార్డుల విషయంలో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతిభ ఆధారంగా ఉద్యోగులకు ఇచ్చే గ్రీన్ కార్డుల కోటాను 12 నుంచి 57శాతానికి పెంచేందుకు సిద్ధమమైంది. ఈ మేరకు ట్రంప్ సీనియర్ అడ్వైజర్ జారెడ్ కష్నర్ వైట్ హౌస్లో జరిగిన కేబినెట్ మీటింగ్లో ప్రకటన చేశారు.
ట్రంప్ చేపట్టిన వలస సంస్కరణల ప్రాజెక్టుకు కష్నర్ నేతృత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చివరి దశలో ఉన్న ఈ ప్రాజెక్టు త్వరలోనే కాంగ్రెస్ ముందుకు రానుంది. కొత్త విధానం ద్వారా ప్రతిభ ఉన్నవారు గ్రీన్ కార్డులు పొందే అవకాశముంటుందని, దీంతో పాటు వచ్చే పదేళ్లలో అమెరికా పన్ను ఆదాయం 500బిలియన్ డాలర్లకు పెరుగుతుందన్నది కుష్నర్ అభిప్రాయం.
అమెరికాలో ప్రస్తుతం అమలవుతున్న వలస విధానం చాలా పాతది. ఈ విధానంలో ప్రతిభ ఆధారంగా కేవలం 12శాతం మందికి మాత్రమే గ్రీన్ కార్డులు ఇస్తున్నారు. అయితే కెనడాలో ఇది 53 శాతం ఉండగా, న్యూజిలాండ్లో 59, ఆస్ట్రేలియాలో 63, జపాన్లో 52శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో అమెరికాలోనూ దీన్ని 57శాతానికి పెంచాలని ట్రంప్ ప్రతిపాదించారు.
దాదాపు ఐదున్నర దశాబ్దాల క్రితం అమెరికా వలస విధానంలో సంస్కరణలు చేశారు. ఆ తర్వాత ఎలాంటి మార్పులకు నోచుకోలేదు. ప్రస్తుత విధానం వల్ల నైపుణ్యం కలిగిన యువతకు అవకాశాలు లభించడంలేదని, అందుకే కొత్త విధానాన్ని రూపొందిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. తాజా నిర్ణయం హెచ్ 1బీ వీసాతో అమెరికాకు వెళ్లి గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది భారత టెక్కీలకు మేలు చేకూర్చనుంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు