జింబాబ్వే క్రికెట్ జట్టును సస్పెండ్ చేసిన ఐసీసీ..
- July 19, 2019
ఒకప్పుడు అత్యుత్తమ క్రికెట్ జట్లలో ఒక్కటిగా ఉన్న జింబాబ్వే కాలక్రమేణ ఉనికే ప్రశ్నార్ధకంగా మార్చుకుంది . మూలిగే నక్కపై తాటి కాయ పడినట్టు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) జింబాబ్వే క్రికెట్ జట్టుకు భారీ షాక్ ఇచ్చింది. ఆ జట్టును అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేసింది. జింబాబ్వే ప్రభుత్వం ఆ దేశ క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో మితిమీరిన జోక్యం చేసుకుంటుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. సస్పెన్షన్ వెంటనే అమలులోకి వస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.
ఇప్పటినుంచి ఐసీసీ నిర్వహించే అంతర్జాతీయ టోర్నీల్లో జింబాబ్వేకి చెందిన క్రికెట్ జట్లు ఏవీ టోర్నీల్లో పాల్గొనడానికి వీలులేదు. అలాగే జింబాబ్వే క్రికెట్కు అందిస్తున్న నిధుల సాయాన్ని కూడా ఐసీసీ పూర్తిగా నిలిపివేసింది. కీలక ఆటగాళ్ళతో మేటి జట్లను సైతం మట్టికరిపించిన జింబాబ్వే వరల్డ్ క్లాస్ క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆండీ పైక్రాఫ్ట్, ఆండీ ఫ్లవర్, ఎడ్డో బ్రాండెస్,క్రెయిగ్ ఎవాన్స్ లాంటి మేటి ఆటగాళ్ళు ఆ జట్టు నుంచి ప్రాతినిద్యం వహించారు. దేశంలో నెలకొన్న రాజకీయ సంక్షోభ పరిస్థితులు ఆ క్రికెట్ జట్టుపై కూడా పడడంతో క్రమంగా ప్రభను కోల్పోయింది.
తాజా వార్తలు
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక







