ప్రముఖ వ్యాపారవేత్త లక్ష్మీ నివాస్ మిత్తల్ సోదరుడు అరెస్ట్
- July 24, 2019
బోస్నియా: ప్రముఖ వ్యాపారవేత్త లక్ష్మీ నివాస్ మిత్తల్ సోదరుడు ప్రమోద్ మిత్తల్ను ఆర్థిక నేరాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న అభియోగాల కింద ఐరోపాలోని బోస్నియా అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆరోపణలు నిజమని తేలితే అక్కడి చట్టాల ప్రకారం దాదాపు 45సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బోస్నియాలో అత్యంత పెద్ద ఎగుమతిదారుగా ఉన్న జీఐకేఐఎల్ కంపెనీకి ప్రమోద్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. ప్రమోద్తో పాటు కంపెనీ జనరల్ మేనేజర్ పరమేశ్ భట్టాచార్య, బోర్డు సభ్యుడు రజీబ్ డాశ్ను సైతం అదుపులోకి తీసుకున్నట్లు అక్కడి ఓ ఉన్నతాధికారి స్థానిక మీడియాకు తెలిపారు. ప్రస్తుతం కంపెనీలో సోదాలు నిర్వహిస్తున్న పోలీసులు ఆధారాలతో సహా వారిని బుధవారం కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!







