పాస్పోర్ట్ చూపే పని లేకుండా 20,000 మంది ట్రావెలింగ్
- July 24, 2019
దుబాయ్: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పాస్పోర్ట్ చూపే పని లేకుండా సుమారు 20,000 మంది ప్రయాణీకులు ఇప్పటికే ప్రయాణం చేశారు. స్మార్ట్ టన్నెల్ ద్వారా ఇది సాధ్యమయ్యింది. గత ఏడాది అక్టోబర్లో ఈ స్మార్ట్ టన్నెల్ని ప్రారంభించారు. బిజినెస్ మరియు ఫస్ట్ క్లాస్ ట్రావెలర్స్కి మాత్రమే టెర్మినల్ 3 వద్ద అందుబాటులో వుంది ఈ హైటెక్ సర్వీస్. సింగిల్ స్టెప్లో సీమ్లెస్ ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ ఈ టెక్నాలజీ సొంతం. ఫింగర్ ప్రింట్తో కూడా అవసరం లేదిక్కడ. ప్రయాణీకులు స్మార్ట్ టన్నెల్లో ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ రికగ్నిషన్ టెక్నాలజీ కెమెరా వైపు చూస్తే సరిపోతుంది. అక్కడ క్లియరెన్స్ వస్తే, ప్యాసింజర్స్, తమ పాస్పోర్ట్పై స్టాంపింగ్తో పనిలేకుండానే ప్రయాణించడానికి వీలుంది. మొత్తంగా మూడు నుంచి నాలుగు సెకెండ్ల పాటు మాత్రమే ఈ ప్రక్రియ నడుస్తుంది. స్మార్ట్ న్నెల్ని ఏర్పాటు చేసిన తొలి నగరంగా దుబాయ్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







