ఎయిర్‌ ఏషియా వారి గొప్ప ఆఫర్‌..

- January 06, 2016 , by Maagulf
ఎయిర్‌ ఏషియా వారి గొప్ప ఆఫర్‌..

ఎయిర్‌ ఏషియా ఇండియా విమానయాన సంస్థ దేశీయ విమానయానానికి టిక్కెట్లపై ఆఫర్‌ ప్రకటించింది. ఖమాసివ్‌ న్యూఇయర్‌ సేల్‌గ ప్రమోషన్స్‌లో భాగంగా ఎయిర్‌ఏషియా ఇండియా టిక్కెట్లపై ఆఫర్లు ఇస్తోంది. జనవరి 10వ తేదీ వరకు ఈ ఆఫర్‌ ఉంటుంది. ఈ ఏడాది మే 1వ తేదీ నుంచి 2017 ఫిబ్రవరి 5వ తేదీ లోపల చేసే ప్రయాణాలపై ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. ఆఫర్‌ ప్రకారం అత్యంత తక్కువ ధర టిక్కెట్‌ గువహటి నుంచి ఇంఫాల్‌కు రూ.899. బెంగళూరు నుంచి చండీగఢ్‌కు రూ.3,499, దిల్లీ నుంచి విశాఖపట్నం టిక్కెట్‌ ధర రూ.2,499, బెంగళూరు నుంచి కొచ్చి రూ.1299, బెంగళూరు నుంచి గోవా రూ.1,099, బెంగళూరు నుంచి దిల్లీకి రూ. 3,299, దిల్లీ నుంచి గోవాకు టిక్కెట్‌ ధర రూ.3,299.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com