అక్టోబర్ నుంచి అబుదాబీలో టోల్ గేట్స్
- July 25, 2019
అబుదాబీ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, కొత్త ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ని ప్రవేశపెట్టబోతున్నట్లు వెల్లడించింది. అబుదాబీ ఐలాండ్లోకి వెళ్ళేవారు, వచ్చేవారికి ఈ గేట్ ద్వారానే మార్గం వుంటుంది. అక్టోబర్ 15 నుంచి ఈ విధానం యాక్టివ్ అవుతుందని అధికారులు వెల్లడించారు. ప్రైవేటు వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించడం, కార్పూలింగ్ విధానాన్ని ఎంకరేజ్ చేయడంలో భాగంగా ఈ సిస్టమ్ని అందుబాటులోకి తెస్తున్నామని డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వర్గాలు పేర్కొన్నాయి. మొత్తం నాలుగు గేట్స్ అబుదాబీలో అందుబాటులోకి వస్తున్నాయి. అల్ మక్తా బ్రిడ్జి, ముసాఫా బ్రిడ్జి, షేక్ జాయెద్ బ్రిడ్జి అలాగే షేక్ ఖలీఫా బ్రిడ్జిపై ఈ గేట్లను ఏర్పాటు చేస్తున్నారు. పీక్ అవర్స్లో 4 దిర్హామ్లు, నాన్ పీక్ అవర్స్లో 2 దిర్హామ్లుగా టోల్ ఫీజుని నిర్ణయించారు. శుక్రవారాలు అలాగే పబ్లిక్ హాలీడేస్లో 2 దిర్హామ్లు వసూలు చేస్తారు. ఇ-పేమెంట్ మెషీన్ల ద్వారా వాహనదారులు టోల్ గేట్స్ ఫీజు చెల్లించవచ్చు. నెంబర్ ప్లేట్ ఆధారంగా ఫీజుని టోల్గేట్స్ వసూలు చేస్తాయి.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!