వేతనాలు అందక 4,000 మంది వలసదారుల ఆవేదన

- July 25, 2019 , by Maagulf
వేతనాలు అందక 4,000 మంది వలసదారుల ఆవేదన

కువైట్‌: నాలుగు నెలలుగా వేతనాలు అందక ఆవేదన చెందుతున్నామంటూ 4,000 మందికి పైగా వలసదారులు ఆందోళన బాట పట్టారు. వారితో సంప్రదింపులు చేపట్టినట్లు మినిస్ట్రీ ఆఫ్‌ సోషల్‌ ఎఫైర్స్‌ అండ్‌ లేబర్‌ వర్గాలు వెల్లడించాయి. షేక్‌ జబెర్‌ అల్‌ అహ్మద్‌ స్టేడియం వద్ద ఈ ఆందోళన జరిగింది. ఆందోళన చేపట్టినవారిలో ఎక్కువమంది ఆసియాకి చెందిన వలసదారులే వున్నారు. బాధిత వలసదారుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా, తాము పనిచేస్తున్న కంపెనీ తమ రెసిడెన్సీ పర్మిట్స్‌ని రెన్యూవల్‌ చేయని కారణంగా తాము అక్రమంగా దేశంలో నివాసం వుంటున్నట్లుగా మారిందని ఆందోళన చేస్తున్న వలసదారుల్లో కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. కువైట్‌ ఆయిల్‌ కంపెనీతో కాంట్రాక్ట్‌ వున్న ఓ కాంట్రాక్టింగ్‌ కంపెనీ వీరిని బాధితులుగా మార్చింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com