ఎతిహాద్ రైల్: కార్గో ట్రాన్స్పోర్ట్ జోరు
- January 06, 2016
యూఏఈ నేషనల్ రైల్వే డెవలపర్ అయిన ఎతిహాద్ రైల్ సెవా లాజిస్టిక్స్తో ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా మల్టీ మోడల్ కనెక్టివిటీని సెవా లాజిస్టిక్స్ ఉపయోగించుకోవడానికి వీలు కలిగింది. 2009లో ఎతిహాద్ రైల్ స్థాపించబడింది. యూఏఈ నేషనల్ ఫ్రైట్ మరియు ప్యాసింజర్ రైల్వే నెట్వర్క్ నిర్మాణం, మరియు నిర్వహణ బాధ్యతల్ని ఎతిహాద్ రైల్ స్వీకరించింది. మూడు స్టేజీల్లో రైల్వే నెట్వర్క్ నిర్మితం కావాల్సి ఉంది. జీసీసీ రైల్ నెట్వర్క్లో ఇది కీలక భూమిక పోషించనుంది. ఇందులో తొలి స్టేజ్ వినియోగంలోకి వచ్చింది. అయితే తొలి స్టేజ్ పూర్తిగా సరుకు రవాణా కోసమే ఉపయోగపడ్తోంది. గ్యాస్ ఫీల్డ్స్ షా అండ్ హబ్షాన్ నుంచి రువాయిస్ వరకు తొలి స్టేజ్ నిర్మాణం పూర్తయ్యింది. రెండో స్టేజ్లో ముసాఫా నుంచి ఖలీఫా పోర్ట్ మరియు జెబెల్ ఎయిర్పోర్ట్ వరకు ప్లాన్ చేశారు. అయితే ఇది సౌదీ ఒమన్ బోర్డర్స్ వరకూ ఎక్స్టెండ్ చేయవలసి ఉంది. పూర్తిస్థాయిలో ఎతిహాద్ రైల్ ప్రాజెక్ట్ పూర్తయితే, ఆ తర్వాతే ప్రయాణీకులకు ఈ రైల్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ఈలోగా ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికీ, సెవా వంటి సంస్థలతో సంబంధాలు కొనసాగించడానికి సరుకు రవాణాకు అనుమతిచ్చింది ఎతిహాద్ రైల్.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







