శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల
- August 02, 2019తిరుమల: నవంబరు మాసానికి సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను తితిదే విడుదల చేసింది. మొత్తం 69,254 టికెట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.టికెట్లను www.tirumala.org వెబ్సైట్ ద్వారా ఉదయం 10 గంటల నుంచి అందుబాటులోకి తెచ్చింది. ఎలక్ట్రానిక్ లాటరీ విధానం కింద 10,904 సేవా టికెట్లను విడుదల చేసింది. సుప్రభాతం 7549, తోమాల 120, అర్చన 120, అష్టదళ పాదపద్మారాధన 240, నిజపాద దర్శనం కోసం 2875 టికెట్లను విడుదల చేసింది. కరెంటు బుకింగ్ కింద 58,350 ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేసింది. దీనిలో విశేష పూజ 1,500, కల్యాణోత్సవం 13,300, ఊంజల్సేవ 4,200, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,700, వసంతోత్సవం 14,850, సహస్రదీపాలంకరణ కోసం 16,800 టికెట్లు విడుదల చేసింది. మరోవైపు జులైలో శ్రీవారికి రూ.106.28 కోట్ల హుండీ ఆదాయం వచ్చిందని, ఇటీవలి కాలంలో ఇది రికార్డు అని తితిదే ఓ ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ