అమర్నాథ్ రూట్లో ల్యాండ్మైన్లు.. యాత్రికులపై పాక్ టార్గెట్
- August 02, 2019
హైదరాబాద్: పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాదులు.. భారీ కుట్రకు ప్లానేశారు. కశ్మీర్లో జరుగుతున్న అమర్నాథ్ యాత్రకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. పాకిస్థాన్ ఆర్మీ సహాయంతో అక్కడి ఉగ్రవాదులు అమర్నాథ్ యాత్రికులను భయకంపితులకు గురిచేస్తున్నట్లు భారతీయ ఆర్మీ వెల్లడించింది. గత నాలుగైదు రోజుల నుంచి ఇంటెలిజెన్స్ సమాచారం అందుతోందని, పాక్ ఆర్మీ సాయంతో ఉగ్రవాదులు అమర్నాథ్ యాత్రను అడ్డుకుంటున్నట్లు తెలిసిందని, దీనిలో భాగంగా యాత్ర రూట్లో గాలింపులు చేపట్టామని చిన్నార్ కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ కేజీఎస్ థిల్లాన్ తెలిపారు. అయితే తమ గాలింపుల్లో పాక్కు చెందిన ల్యాండ్మైన్లు, పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నట్లు లెఫ్టినంట్ జనరల్ థిల్లాన్ చెప్పారు. ఐఈడీలు, నాటు బాంబులు అమర్నాథ్ రూట్లో దొరికినట్లు ఆర్మీ వర్గాలు చెప్పాయి. ఇంకా ఆ రూట్లో విస్తృతంగా గాలింపు జరుగుతున్నట్లు ఆర్మీ తెలిపింది. కశ్మీర్లో ఉన్న శాంతి పరిస్థితులను చెదరగొట్టేందుకు పాక్ ఆర్మీ ప్రయత్నిస్తోందని జనరల్ థిల్లాన్ ఆరోపించారు. ఇలాంటి వాటిని అడ్డుకుంటామన్నారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు







