'వర్క్ ఫ్రం హోం' పేరుతో ఘరానా మోసం
- August 04, 2019
వర్క్ ఫర్ హోం పేరిట మోసం చేశారంటూ పలువురు బాధితులు మల్కాజిగిరి పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. మల్కాజిగిరి విష్ణుపురిలో వర్క్ఫ్రం హోం పేరిట ఓ కార్యాలయాన్ని ఇటీవలే తెరిచారు. పది, ఇంటర్, డిగ్రీ చేసిన వారికి మంచి అవకాశం అంటూ నిరుద్యోగులకు ఉద్యోగం పేరిట ఆశ కల్పించారు. ఇందులో జాయిన్ అయ్యేవారు రూ. 2,500లు చెల్లించి చేరాలి. వారికి కొన్ని నిబంధనలు పెట్టి కొంత పని ఇచ్చారు. కాగా ఇందులో చైన్ లింక్గా ఇందులో చేరిన వ్యక్తి మరికొందరిని చేర్పించాల్సి ఉంటుంది. ఒక వ్యక్తిని చేర్పిస్తే రూ . 500 ఇస్తారు. ఇలా నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టి వేలకు వేలు వసూలు చేశారు. విశ్వచైతన్య డిగ్రీ కళాశాలకు చెందిన వారితో సహా సుమారు 30 మంది వరకు ఈ వర్క్ ప్రం హోంలో చేరారు. ఇదంతా మోసం అని తెలుసుకున్న బాధితులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!