'వర్క్‌ ఫ్రం హోం' పేరుతో ఘరానా మోసం

- August 04, 2019 , by Maagulf
'వర్క్‌ ఫ్రం హోం' పేరుతో ఘరానా మోసం

వర్క్‌ ఫర్‌ హోం పేరిట మోసం చేశారంటూ పలువురు బాధితులు మల్కాజిగిరి పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. మల్కాజిగిరి విష్ణుపురిలో వర్క్‌ఫ్రం హోం పేరిట ఓ కార్యాలయాన్ని ఇటీవలే తెరిచారు. పది, ఇంటర్‌, డిగ్రీ చేసిన వారికి మంచి అవకాశం అంటూ నిరుద్యోగులకు ఉద్యోగం పేరిట ఆశ కల్పించారు. ఇందులో జాయిన్‌ అయ్యేవారు రూ. 2,500లు చెల్లించి చేరాలి. వారికి కొన్ని నిబంధనలు పెట్టి కొంత పని ఇచ్చారు. కాగా ఇందులో చైన్‌ లింక్‌గా ఇందులో చేరిన వ్యక్తి మరికొందరిని చేర్పించాల్సి ఉంటుంది. ఒక వ్యక్తిని చేర్పిస్తే రూ . 500 ఇస్తారు. ఇలా నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టి వేలకు వేలు వసూలు చేశారు. విశ్వచైతన్య డిగ్రీ కళాశాలకు చెందిన వారితో సహా సుమారు 30 మంది వరకు ఈ వర్క్‌ ప్రం హోంలో చేరారు. ఇదంతా మోసం అని తెలుసుకున్న బాధితులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com