సుష్మా స్వరాజ్‌ మృతిపై బుక్‌ ఆఫ్‌ కండోలెన్స్‌ ప్రారంభించనున్న ఇండియన్‌ ఎంబసీ

- August 08, 2019 , by Maagulf
సుష్మా స్వరాజ్‌ మృతిపై బుక్‌ ఆఫ్‌ కండోలెన్స్‌ ప్రారంభించనున్న ఇండియన్‌ ఎంబసీ

మస్కట్‌: ఒమన్‌లోని ఇండియన్‌ ఎంబసీ, బుక్‌ ఆఫ్‌ కండోలెన్స్‌ని ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. భారత మాజీ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ మృతి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గుండె పోటుతో ఇటీవల సుష్మా స్వరాజ్‌ మృతి చెందిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో, ఇండియన్‌ ఎంబసీ ఫేస్‌ బుక్‌ ద్వారా 'బుక్‌ ఆఫ్‌ కండోలెన్స్‌' వివరాల్ని వెల్లడించడం జరిగింది. సుష్మా స్వరాజ్‌ గొప్ప మానవతా వాది అనీ, ఆమె దేశానికి అందించిన సేవలు చాలా గొప్పవనీ, విదేశాలకు చెందినవారూ ఆమెను గౌరవిస్తారనీ ఇండియన్‌ ఎంబసీ పేర్కొంది. ఇండియన్‌ ఎంబసీలోని డిప్లమాటిక్‌ ఏరియాలో ఆగస్ట్‌ 7, 8 మరియు 11వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బుక్‌ ఆఫ్‌ కండోలెన్స్‌ని ఓపెన్‌ చేస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com