జమ్మూకాశ్మీర్పై యూఏఈ ట్రావెల్ అడ్వయిజరీ
- August 08, 2019
యూఏఈ, తమ పౌరులకు జమ్మూకాశ్మీర్ విషయమై ట్రావెల్ అడ్వయిజరీ జారీ చేసింది. యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ మరియు ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్, సోషల్ మీడియా ద్వారా తమ పౌరులకు ఈ మేరకు ఓ స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం భారతదేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో యూఏఈ పౌరులు అప్రమత్తంగా వుండాలనీ, స్థానిక ఎంబసీ అధికారులతో ఎప్పటికప్పుడు టచ్లో వుండాలని ఆ అడ్వయిజరీలో పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్ వెళ్ళాలనుకునేవారు మాత్రం తమ ప్రయాణాల్ని పోస్ట్పోన్ చేసుకోవాలని సూచించింది. కాగా, ఇప్పటికే జర్మనీ, ఆస్ట్రేలియా మరియు యూకే తమ పౌరులకు ఈ విషయమై స్పష్టమైన అడ్వయిజరీని జారీ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- దుబాయ్ ఐకానిక్ బుర్జ్ అల్ అరబ్కు 18 నెలల భారీ పునరుద్ధరణ
- నార్కట్ పల్లిలో విషాదం: కారులో ఊపిరాడక చిన్నారి మృతి
- వడదెబ్బ మృతులకు సర్కార్ భరోసా..వివరాలివే!
- ప్రముఖ హాస్య నటులు బాబూమోహన్ కి రేలంగి వెంకట్రామయ్య జాతీయ అవార్డు
- మలేషియాలో అక్రమంగా ఉన్న తెలుగు కార్మికులకు కీలక హెచ్చరిక..
- హైదరాబాద్ లో లండన్ వర్సిటీ క్యాంపస్
- షార్జాలో విద్యాసంస్థల పునఃప్రారంభం
- అమెరికా దిగ్బంధనం: హోర్ముజ్ జలసంధి వద్ద ఉత్కంఠ
- నారా లోకేష్కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు
- సౌదీ అరేబియా నేషనల్ హెల్త్ సర్వే ప్రారంభం..!!









