జమ్మూకాశ్మీర్‌పై యూఏఈ ట్రావెల్‌ అడ్వయిజరీ

- August 08, 2019 , by Maagulf
జమ్మూకాశ్మీర్‌పై యూఏఈ ట్రావెల్‌ అడ్వయిజరీ

యూఏఈ, తమ పౌరులకు జమ్మూకాశ్మీర్‌ విషయమై ట్రావెల్‌ అడ్వయిజరీ జారీ చేసింది. యూఏఈ మినిస్ట్రీ ఆఫ్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌ మరియు ఇంటర్నేషనల్‌ కో-ఆపరేషన్‌, సోషల్‌ మీడియా ద్వారా తమ పౌరులకు ఈ మేరకు ఓ స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం భారతదేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో యూఏఈ పౌరులు అప్రమత్తంగా వుండాలనీ, స్థానిక ఎంబసీ అధికారులతో ఎప్పటికప్పుడు టచ్‌లో వుండాలని ఆ అడ్వయిజరీలో పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్‌ వెళ్ళాలనుకునేవారు మాత్రం తమ ప్రయాణాల్ని పోస్ట్‌పోన్‌ చేసుకోవాలని సూచించింది. కాగా, ఇప్పటికే జర్మనీ, ఆస్ట్రేలియా మరియు యూకే తమ పౌరులకు ఈ విషయమై స్పష్టమైన అడ్వయిజరీని జారీ చేయడం జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com