ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా వాసిరెడ్డి పద్మ
- August 08, 2019
ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ నియమితులయ్యారు. ఈ మేరకు 2019, ఆగస్టు 08వ తేదీ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవికి నన్నపనేని రాజకుమారి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామా లేఖను గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ ఆమోదించారు. ఐదేళ్ల పాటు వాసిరెడ్డి పద్మ పదవిలో కొనసాగనున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో నన్నపనేని రాజకుమారికి మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ పదవిని కట్టబెట్టారు. మరో రెండేళ్ల పదవీకాలం ఉండగానే నన్నపనేని తన పదవికి రాజీనామా చేశారు.
ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన వారికి సీఎం జగన్ పదవులు కట్టబెడుతున్నారు. మంత్రి వర్గంలో స్థానం దక్కని వారికి ఆయా పదవులను కేటాయిస్తున్నారు సీఎం జగన్. వైసీపీ అధికార ప్రతినిధిగా వాసిరెడ్డి వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో టీడీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా మాట్లాడారు. సామాజిక వర్గ కోణంలో భాగంగా పదవిని ఆమెకు కట్టబెట్టారని సమాచారం.
తాజా వార్తలు
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..









