ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా వాసిరెడ్డి పద్మ
- August 08, 2019
ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ నియమితులయ్యారు. ఈ మేరకు 2019, ఆగస్టు 08వ తేదీ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవికి నన్నపనేని రాజకుమారి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామా లేఖను గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ ఆమోదించారు. ఐదేళ్ల పాటు వాసిరెడ్డి పద్మ పదవిలో కొనసాగనున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో నన్నపనేని రాజకుమారికి మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ పదవిని కట్టబెట్టారు. మరో రెండేళ్ల పదవీకాలం ఉండగానే నన్నపనేని తన పదవికి రాజీనామా చేశారు.
ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన వారికి సీఎం జగన్ పదవులు కట్టబెడుతున్నారు. మంత్రి వర్గంలో స్థానం దక్కని వారికి ఆయా పదవులను కేటాయిస్తున్నారు సీఎం జగన్. వైసీపీ అధికార ప్రతినిధిగా వాసిరెడ్డి వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో టీడీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా మాట్లాడారు. సామాజిక వర్గ కోణంలో భాగంగా పదవిని ఆమెకు కట్టబెట్టారని సమాచారం.
తాజా వార్తలు
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!