ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా వాసిరెడ్డి పద్మ
- August 08, 2019
ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ నియమితులయ్యారు. ఈ మేరకు 2019, ఆగస్టు 08వ తేదీ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవికి నన్నపనేని రాజకుమారి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామా లేఖను గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ ఆమోదించారు. ఐదేళ్ల పాటు వాసిరెడ్డి పద్మ పదవిలో కొనసాగనున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో నన్నపనేని రాజకుమారికి మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ పదవిని కట్టబెట్టారు. మరో రెండేళ్ల పదవీకాలం ఉండగానే నన్నపనేని తన పదవికి రాజీనామా చేశారు.
ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన వారికి సీఎం జగన్ పదవులు కట్టబెడుతున్నారు. మంత్రి వర్గంలో స్థానం దక్కని వారికి ఆయా పదవులను కేటాయిస్తున్నారు సీఎం జగన్. వైసీపీ అధికార ప్రతినిధిగా వాసిరెడ్డి వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో టీడీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా మాట్లాడారు. సామాజిక వర్గ కోణంలో భాగంగా పదవిని ఆమెకు కట్టబెట్టారని సమాచారం.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







