పాక్ నుంచి వచ్చేస్తున్న ఇండియన్ హై కమిషనర్
- August 08, 2019
న్యూఢిల్లీ:జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తున్న భారత రాజ్యాంగంలోని అధికరణ 370 రద్దు, ఆ రాష్ట్ర విభజన నిర్ణయాలను పాకిస్థాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని నిలిపేయడం, దౌత్య సంబంధాల కుదింపు, ఇండియన్ హై కమిషనర్ను వెనుకకు పంపడం, సమ్ఝౌతా ఎక్స్ప్రెస్ రైలు సర్వీసు నిలిపివేత వంటి చర్యలతో అగ్గి మీద గుగ్గిలమవుతోంది. మరోవైపు పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవాలు జరిగే ఆగస్టు 14న కశ్మీరీలకు సంఘీభావంగా జరపాలని, భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవాలు జరిగే ఆగస్టు 15న బ్లాక్ డే నిర్వహించాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో ఇండియన్ హై కమిషనర్ను తిరిగి భారత్ వెళ్ళిపోవాలని పాకిస్థాన్ కోరింది. దీంతో పాకిస్థాన్లోని ఇండియన్ హై కమిషనర్ అజయ్ బిసరియా తిరిగి భారత దేశానికి వచ్చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
పాకిస్థాన్ వైఖరిపై భారతదేశం స్పందిస్తూ దౌత్య సంబంధాల కుదింపు నిర్ణయంపై పునరాలోచించాలని కోరింది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







