పాక్ నుంచి వచ్చేస్తున్న ఇండియన్ హై కమిషనర్
- August 08, 2019న్యూఢిల్లీ:జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తున్న భారత రాజ్యాంగంలోని అధికరణ 370 రద్దు, ఆ రాష్ట్ర విభజన నిర్ణయాలను పాకిస్థాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని నిలిపేయడం, దౌత్య సంబంధాల కుదింపు, ఇండియన్ హై కమిషనర్ను వెనుకకు పంపడం, సమ్ఝౌతా ఎక్స్ప్రెస్ రైలు సర్వీసు నిలిపివేత వంటి చర్యలతో అగ్గి మీద గుగ్గిలమవుతోంది. మరోవైపు పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవాలు జరిగే ఆగస్టు 14న కశ్మీరీలకు సంఘీభావంగా జరపాలని, భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవాలు జరిగే ఆగస్టు 15న బ్లాక్ డే నిర్వహించాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో ఇండియన్ హై కమిషనర్ను తిరిగి భారత్ వెళ్ళిపోవాలని పాకిస్థాన్ కోరింది. దీంతో పాకిస్థాన్లోని ఇండియన్ హై కమిషనర్ అజయ్ బిసరియా తిరిగి భారత దేశానికి వచ్చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
పాకిస్థాన్ వైఖరిపై భారతదేశం స్పందిస్తూ దౌత్య సంబంధాల కుదింపు నిర్ణయంపై పునరాలోచించాలని కోరింది.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..