భారత దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు
- August 10, 2019
భారత దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ .. ఇక్కడ అని లేకుండా ప్రతి రాష్టాన్ని వర్షాలు ముంచెత్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలలో వరుణుడు భీభత్సం సృష్టిస్తున్నాడు. కర్ణాటక,కేరళ, తెలంగాణ, ఏపీ రాష్ఱ్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి,కృష్ణ ,కావేరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్నా భారీ వర్షాలతో కేరళ అతలాకుతలం అవుతోంది. భారీ వరదల కారణంగా 25 మంది మృతి . వర్షం కారణంగా కొచ్చి విమానశ్రయాన్ని కూడా ముసివేశారు. అలాగే కర్నాటకలో వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాష్ఱ్రాలోని అన్ని జలశయాలు నిండుకుండలా కనిపిస్తున్నాయి. డ్యామ్లు పూర్తి స్థాయిలో నింది ప్రమాదరస్థాయికి చేరుకున్నాయి. అక్కడి వరద బీభత్సానికి అద్దం పట్టేలా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బైక్పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు కాలువలో కొట్టుకుపోతున్న దృశ్యాలు ఆ ర్రాష్ట్రంపై వరుణుడు ఎంతటి ప్రతాపాన్ని చూపిస్తున్నాడో తెలియజేస్తుంది. కొడగు జిల్లా కొరంగల్లో మట్టిరోడ్డుపై ఉన్న చిన్నపాటి వంతెన కింద నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. ఈ సమయంలో ఆ వంతెనపై నుంచి బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు వెళ్లేందుకు ప్రయత్నించారు. సరిగ్గా ఆ వారు వంతెన దాటుతున్న సమయంలోనే మట్టిరోడ్డుతో ఉన్న వంతెన తెగింది. దీంతో బైక్తో సహా ఆ ఇద్దరూ వరద నీటిలో కొట్టుకుపోయారు. అయితే వాళ్ళు ఏమయ్యారు అనే విషయం ఇప్పటివరకు తెలియలేదు. బయటకు వచ్చారా? లేదా? అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







