అబుధాబి:ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన 73వ 'స్వాతంత్య్ర దినోత్సవ' వేడుకలు
- August 15, 2019అబుధాబి:73వ భారత స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో యూఏఈ వ్యాప్తంగా భారతీయ వలసదారులు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. యూఏఈలో భారత రాయబారి నవదీప్ సింగ్ సూరి, జాతీయ గీతాలాపన జరుగుతుండగా, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అబుధాబిలోని ఇండియన్ ఎంబసీ వద్ద పెద్దయెత్తున రెసిడెంట్స్ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఉదయం 9 గంటల నుంచి 12.30 నిమిషాల వరకు ఓపెన్ హౌస్ నిర్వహిస్తున్నందున, ప్రత్యేకమైన అపాయింట్మెంట్ ఏమీ అవసరం లేదని ఎంబసీ పేర్కొంది. అమ్నెస్టీని పొంది, యూఏఈలో తమ నివాసాన్ని లీగల్ చేసుకోవచ్చుని ఈ సందర్భంగా సూరి పేర్కొన్నారు.
ఈ నెల 23న గురునానక్ దేవ్ జయంతి సందర్భంగా సిక్కు సమాజం 550 వలంటీర్స్తో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ని ఇండియన్ సోషల్ సెంటర్ లో నిర్వహిస్తోంది.అబుధాబి బ్లడ్ బ్యాంక్కి బ్లడ్ డొనేట్ చేసేందుకోసం 550 వాలంటీర్లను వినియోగిస్తున్నట్లు భారత రాయబారి తెలిపారు.ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరారు.సిక్ కమ్యూనిటీ, వివిధ రెలిజియన్స్కి చెందినవారి నుంచి ఈ క్యాంపెయిన్ని నిర్వహిస్తోంది.ఈ కార్యక్రమం తదనంతరం అల్పాహారం ఏర్పాటు చేసారు.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్