బుర్జ్ ఖలీఫాపై భారత్, పాక్ పతాకాల లైటింగ్
- August 17, 2019
దుబాయ్కి చెందిన ప్రముఖ భవనం బుర్జ్ ఖలీఫాపై భారత్, మరియు పాకిస్తాన్ దేశాల జెండాల వెలుగులు దర్శనమిచ్చాయి. శుక్రవారం కాస్సేపు భారత త్రివర్ణ పతాకం, కాస్సేపు పాకిస్తాన్ జెండా దర్శనమివ్వడంతో సందర్శకులు ఆశ్చర్యచకితులయ్యారు.. ఆయా దేశాలకు చెందిన సందర్శకులు తమ తమ జాతీయ పతాకాలు బుర్జ్ ఖలీఫాపై దర్శనమివ్వడాన్ని ఆస్వాదించారు. ఆగస్ట్ 14న పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవం కాగా, ఆగస్ట్ 15 భారత స్వాతంత్య్ర దినోత్సవం. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అతి ఎత్తయిన భవనాల్లో ఒకటైన బుర్జ్ ఖలీఫాపై ఈ జెండాల్ని ప్రదర్శించడం జరిగింది.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







