అరెస్ట్కు సీబీఐ రంగం సిద్ధం
- August 21, 2019
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చిదంబరంకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం తిరస్కరించిన విషయం తెలిసిందే. ఇది ఇలావుంటే, ఢిల్లీలోని చిదంబరం ఇంటికి వెళ్లిన సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఆయన ఇంట్లో లేకపోవడంతో వెనుతిరిగారు. ఆ తర్వాత వెళ్లిన మరో అధికారుల బృందం చిదంబరం ఇంటికి నోటీసులు అంటించింది.
రెండు గంటల్లోపు సీబీఐ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. బెయిల్ పిటిషన్ రద్దు కావడం, సీబీఐ నోటీసుల నేపథ్యంలో చిదంబరం అరెస్టు తప్పదేమోనన్న చర్చ జరుగుతోంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో చిదంబరం తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా ప్రతికూలంగా తీర్పు చెబితే చిదంబరం జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!