యూఏఈలో 'రూపే' కార్డ్ని ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ
- August 22, 2019యూఏఈ:మిడిల్ ఈస్ట్లో తొలిసారిగా యూఏఈలో రూపే కార్డ్ అందుబాటులోకి రానుంది. మాస్టర్ కార్డ్, వీసా కార్డ్ తరహాలోనే ఇండియాకి చెందిన రూపే కార్డ్ పనిచేయనుంది. ప్రధాని నరేంద్రమోడీ, యూఏఈలో పర్యటించనున్న నేపథ్యంలో ఈ రూపే కార్డ్ని ప్రారంభిస్తారని ఇండియాకి చెందిన టాప్ డిప్లమాట్ ఒకరు వెల్లడించారు. యూఏఈలోని ఇండియన్ అంబాసిడర్ నవ్దీప్ సింగ్ సూరి మాట్లాడుతూ, ఇండియా మరయు యూఏఈ మధ్య ఈ మేరకు మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాడింగ్ జరిగిందనీ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అలాగే యూఏఈకి చెందిన మెర్క్యురీ పేమెంట్స్ సర్వీసెస్ మధ్య ఈ ఒప్పందం కుదిరిందని తెలిపారు. రీజియన్లో యూఏఈ అతి పెద్ద వైబ్రెంట్ బిజినెస్ హబ్ అనీ, యూఏఈలో ఇండియన్ కమ్యూనిటీ పెద్దయెత్తున వుందనీ, ఈ నేపథ్యంలో రూపే కార్డ్ ఇక్కడ విజయవంతమవుతుందని ఆయన వెల్లడించారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,దుబాయ్)
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..