శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అపశృతి.. నలుగురు మృతి
- August 23, 2019
పశ్చిమ బెంగాల్లోని నార్త్ 24 పరగణ జిల్లాలో విషాదం నెలకొంది. కచువాలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. ఈ వేడుకలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరుకావడంతో.. దేవాలయం ప్రహరీ గోడ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు భక్తులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 50 వేలు పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు మమత ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తాజా వార్తలు
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..









