యూఏఈ యొక్క భారత రాయబారిగా పవన్‌ కపూర్‌ నియామకం

- August 28, 2019 , by Maagulf
యూఏఈ యొక్క భారత రాయబారిగా పవన్‌ కపూర్‌ నియామకం

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో భారత అంబాసిడర్‌గా పవన్‌ కపూర్‌ని నియమించింది భారత ప్రభుత్వం. 1990 క్యాడర్‌కి చెందిన ఐఎఫ్‌ఎఫ్‌ ఆఫీసర్‌ ప్రస్తుతం భారత అంబాసిడర్‌గా పనిచేస్తున్న నవ్‌దీప్‌ సింగ్‌ సూరి ని రీప్లేస్‌ చేయనున్నారు. 2016 నుంచి నవ్‌దీప్‌ సింగ్‌ యూఏఈ రాయబారిగా పనిచేస్తున్న విషయం విదితమే. త్వరలోనే పవన్‌ కపూర్‌, యూఏఈ అంబాసిడర్‌గా బాధ్యతలు చేపడ్తారు. భారత ప్రభుత్వం తరఫున వివిధ దేశాల్లో కీలక బాద్యతల్ని పవన్‌ కపూర్‌ నిర్వహించారు. డిప్లమాట్‌గా ఆయన అందించిన సేవలు చాలా గొప్పవని భారత ప్రభుత్వం చెబుతోంది. 2010 నుంచి 2013 వరకు మినిస్ట్రీ ఆఫ్‌ ఎక్స్‌టర్నల్‌ ఎఫైర్స్‌ జాయింట్‌ సెక్రెటరీగా పనిచేశారు. అలాగే ప్రైమ్‌ మినిస్టర్స్‌ ఆఫీస్‌లోనూ పనిచేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com