ఈజిప్టులోని ప్రముఖ యాత్రా స్థలం గిగా పిరమిడ్ల వద్ద కాల్పులు
- January 08, 2016
ఈజిప్టులోని ప్రముఖ యాత్రా స్థలం గిగా పిరమిడ్ల వద్ద యాత్రికులపై ఇద్దరు గుర్తుతెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఆల్-హరమ్ వీధిలోని ఓ హోటల్లోకి వెళ్తున్న టూరిస్టులపైకి మోటార్ సైకిల్పై వచ్చిన దుండగులు కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఎవరూ గాయపడలేదు. టూరిస్టులు వచ్చిన బస్సు, హోటల్ గేటు కొంత ధ్వంసమైంది. ఈజిప్టు కాప్టిక్ ఆర్థోడోక్స్ క్రిస్టియన్లు క్రిస్మస్ సంబరాలు జరుపుకున్న రోజే దాడి ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. దుండగులను పట్టుకునేందుకు పోలీసులు వెతుకులాట ప్రారంభించారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







