టెక్సాస్లో మరోసారి కాల్పుల కలకలం
- September 01, 2019అమెరికాలో మరోసారి గన్ కల్చర్ పడగ విప్పింది. టెక్సాస్ కాల్పులతో ఉలిక్కిపడింది. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందగా.. 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో ముగ్గురు పోలీసులు కూడా ఉన్నారు. వెంటనే నిందితున్ని చుట్టుముట్టిన పోలీసులు.. అతన్ని మట్టుబెట్టారు. అక్కడ ఏం జరుగుతుందో తెలియక స్థానికులు ఉరుకులు పరుగులు పెట్టారు.
బాధితులు ఒడెస్సాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రుల్లో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాల్పులకు పాల్పడిన వ్యక్తి ముందుగా బైక్పై వచ్చాడు. అమెరికా పోస్టల్ విభాగానికి చెందిన ఒక ట్రక్కును హైజాక్ చేసి.. అందులో నుంచే జనాలపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఉగ్రవాద కోణంపై ఆరా తీస్తున్నారు.
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం