విశాఖపట్నంలో వెలుగుచూసిన మరో ఆన్లైన్ దోపిడీ
- September 02, 2019విశాఖలో ఆన్లైన్ చీటింగ్కు పాల్పడుతున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 7.6 లక్షల నగదుతోపాటు బంగారు నాణేలు స్వాధీనం చేసుకున్నారు. బంగారం లింక్ బిజినెస్ చేసేందుకు విశాఖలో 2 రోజుల కిందట ఓ ముఠా మకాం వేసింది. అనుమానం వచ్చిన విశాఖ పోలీసులు దర్యాప్తు చేసి సరైన డాక్యుమెంట్లు లేకపోవడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.
మెండోలిల్ జ్యువెలరీ లిమిటెడ్ కంపెనీ పేరుతో చైన్ లింక్ బిజినెస్ చేసే గుర్గావ్ ముఠా ఓ హోటల్లో మకాం వేసింది. ఆన్లైన్ ద్వారా తమ కంపెనీలో సభ్యులుగా చేరేవారికి నగదుతోపాటు బంగారం ఇస్తామని ఆశచూపారు. ముందుగా 11 వేల నగదుతోపాటు జీఎస్టీ కింద 3 వందలు కట్టాలన్నది స్కీమ్. ఆ తర్వాత కంపెనీ నుంచి ప్రతినెలా 550 రూపాయలు, ఒక గోల్డ్ కాయిన్ ఆఫర్ ఇచ్చారు. దీంతో చాలా మంది ఆసక్తిచూపారు. హోటల్కు పెద్ద ఎత్తున జనాలు రావడంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రెయిడ్ చేసి అందరినీ అదుపులో తీసుకున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ