కాబుల్:బాంబు దాడి.. 16మంది మృతి..
- September 03, 2019కాబూల్ నగరంలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గ్రీన్ విల్లే సమీపంలో బాంబుదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 16మంది మరణించారు. 120 మంది గాయపడ్డారు. వీరిలో చాలామంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ ఘటనకు తామే బాధ్యులమని తాలిబన్లు ప్రకటించుకున్నారు. అమెరికా ప్రతినిధి అల్మయ్ ఖలీల్జాద్ తమ దళాలను ఉపసంహరించుకునే ప్రతిపాదనపై చర్చించేందుకు కాబూల్ వచ్చిన సందర్భంగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. పేలుడు పదార్ధాలు నింపిన వాహనంతో ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. పోలీసులు అక్కడికిచేరుకొని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు