హైదరాబాద్ లో కేజీఎఫ్ 2
- September 05, 2019కేజీఎఫ్..ఈ చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు. కన్నడ చిత్రమైనప్పటికీ అన్ని భాషల్లో డబ్ అయి రికార్డ్స్ బ్రేక్ చేసింది. అక్రమ మైనింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయగా యష్ హీరోగా నటించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి కొనసాగింపుగా చాప్టర్ 2ని భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా కోలార్ ఫీల్డ్స్లోని సైనైడ్ హిల్స్లో షూటింగ్ జరుపుతుండగా అక్కడి పర్యావరణానికి హాని కలుగుతుందంటూ శ్రీనివాస్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం కూడా ఈయన పిటిషన్ గురించి ఆలోచించి షూటింగ్ను ఆపాలని ఆదేశాలిచ్చింది. కోర్టు ఆదేశం తో ఈ సినిమా షూటింగ్ ను హైదరాబాద్, బెంగుళూర్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ సెట్లలో నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ