వెంకటేష్, నాగచైతన్య కాంబినేషన్లో మల్టిస్టారర్ సినిమా
- September 08, 2019
రియల్ లైఫ్ మేనమామ, మేనల్లుడైన వెంకటేష్, నాగచైతన్య కాంబినేషన్లో మల్టిస్టారర్ తెరకెక్కుతోంది. వెంకీ మామ పేరుతో బాబి డైరెక్షన్లో సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లో ఈ చిత్రం రూపొందుతోంది. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇధ్దరు హీరోలు ఉన్నారు కాబట్టి, నిర్మాత సురేష్ బాబు కాస్త ఎక్కువే ఖర్చు పెడుతున్నాడని తెలుస్తోంది. ఇందులో వెంకీకి జోడీగా పాయల్ రాజ్ పుత్, చైతూకి జోడీగా రాశీఖన్నా నటిస్తోంది.
వెంకీమామ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 4న విడుదల చేయాలనుకున్నారు. కానీ దీనికి రెండు రోజుల ముందు చిరంజీవి సైరా వస్తుంది. అందుకే పోటీ పడటం ఇష్టం లేక, నిర్మాత సురేష్ బాబు వెంకీమామని అక్టోబర్ 25కి పోస్ట్ పోన్ చేసుకున్నాడు. అంటే అది దీపావళి సీజన్. కాబట్టి వీకెండ్ తో పాటు పండగ హడావిడి కూడా కలిసొస్తుందనే ఈ డెసిషన్ తీసుకున్నారు. లొకేషన్లు, సెట్లు, యాక్షన్ ఎపిసోడ్స్ కోసం వెంకీమామకి దాదాపు 50 కోట్లు వరకు ఖర్చు పెట్టారని తెలుస్తోంది. మొత్తంగా వెంకీమామపై టాలీవుడ్లో అంచనాలతే బాగానే ఉన్నాయి.
తాజా వార్తలు
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!
- కింగ్ ఫైసల్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- యూఏఈ ట్రావెల్.. ఏ వస్తువులు తీసుకెళ్లవచ్చు? వేటిపై నిషేధం ఉందంటే?
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు







