భారత వలసదారుడ్ని కలిసిన షేక్ మొహమ్మద్
- September 11, 2019
యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, ఓ భారతీయ వలసదారుడ్ని కలిశారు. ఆ భారతీయ వ్యక్తి పేరు దివ్యాంక్ టురాకియా. యాడ్ టెక్ కంపెనీ ఫౌండర్ మరియు సీఈఓ అయిన దివ్యాంక్, తన సంస్థను 3.3 బిలియన్ దిర్హామ్లకు విక్రయించారు. ఈ నేపథ్యంలో షేక్ మొహ్మద్, దివ్యాంక్ని కలిశారు. దుబాయ్, మిడిల్ ఈస్ట్లో సిలికాన్ వ్యాలీగా మారుతోందని చెప్పారు. ఇటీవలి కాలంలో దుబాయ్ ఈ రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందనీ, మల్టీ బిలియన్ టెక్ డీల్స్, దుబాయ్ ఇమేజ్ని మరింత పెంచుతున్నాయని అన్నారాయన. దుబాయ్ ముందు ముందు మరింతగా టెక్ విభాగంలో దూసుకుపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!