ఉగ్రవాద సంస్థలకు భారీ ఖర్చు చేశాం: పాక్ మంత్రి
- September 13, 2019పాకిస్థాన్ ను పాలించిన నేతలు దేశాన్ని సర్వనాశనం చేశారంటూ ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి ఇజాజ్ షా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. అత్యున్నత శాఖను నిర్వహిస్తున్న ఇజాజ్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడంతో పాక్ ప్రభుత్వం షాక్ కు గురైంది. పాకిస్థాన్ జాతీయ టీవీతో మాట్లాడుతూ ఆయన మరో బాంబు పేల్చారు. హఫీజ్ సయీద్ (ముంబై ఉగ్రదాడి మాస్టర్ మైండ్)కి చెందిన జమాత్ ఉద్ దవా లాంటి ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ ప్రభుత్వం ఇప్పటి వరకు కోట్లాది రూపాయలను ఖర్చు చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సంస్థలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. పాకిస్థాన్ లో ఇజాజ్ కు బలమైన నేతగా గుర్తింపు ఉంది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో పాటు మిలిటరీతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆర్మీలో ఆయన బ్రిగేడియర్ గా పని చేశారు. అయితే, ఆయన చేస్తున్న వ్యాఖ్యలు పాక్ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెడుతున్నాయి. పాక్ చెబుతున్న మాటలను అంతర్జాతీయ సమాజం నమ్మడం లేదని, భారత్ నే నమ్ముతోందని కూడా ఆయన ఇటీవల అన్నారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు