సౌదీ - ఇరాక్‌ బోర్డర్‌ క్రాసింగ్‌: కమర్షియల్‌ ఆపరేషన్‌ అక్టోబర్‌లో ప్రారంభం

- September 13, 2019 , by Maagulf
సౌదీ - ఇరాక్‌ బోర్డర్‌ క్రాసింగ్‌: కమర్షియల్‌ ఆపరేషన్‌ అక్టోబర్‌లో ప్రారంభం

రియాద్‌: అరార్‌ బోర్డర్‌ వద్ద కమర్షియల్‌ ఆపరేషన్‌ అక్టోబర్‌ 15 నుంచి ట్రయల్‌ బేసిస్‌లో ప్రారంభం కానున్నాయి. సౌదీ అరేబియా మధ్య క్రాసింగ్‌ కోసం ఈ బోర్డర్‌ని రూపొందించడం జరిగింది. ఇరాక్‌లోని సౌదీ రాయబారి అబ్దుల్‌ అజీజ్‌ అల్‌ షమ్మారి చెప్పారు. అల్‌ షమ్మారితోపాటు సౌదీలోని ఇరాక్‌ రాయబారి అల్‌ జనాబి ఈ బోర్డర్‌ని పరిశీలించారు. హజ్‌ మరియు ఉమ్రా ఫిలిగ్రిమ్స్‌ కూడా వినియోగించుకునేలా ఈ బోర్డర్‌లో ఏర్పాట్లు చేశారు. సౌదీ అరేబియా - ఇరాక్‌ మధ్య ఏర్పడ్డ కొన్ని సమస్యల కారణంగా 1990లో ఈ బోర్డర్‌ని మూసివేశారు. ఇరాకీ బోర్డర్‌కి 70 కిలోమీటర్ల దూరంలో అరార్‌ టౌన్‌ వుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com