రూపాయి ఇడ్లీ బామ్మ
- September 13, 2019
తమిళనాడు:ఈ రోజుల్లో చిన్నస్థాయి హోటల్కు వెళ్లినా జేబులు ఖాళీ అవుతున్నాయి.ప్లేట్ ఇడ్లీ.. తక్కువలో తక్కువ 20 రూపాయలు ఉంటుంది. కానీ ఈ 80 ఏళ్ల బామ్మ మాత్రం రూపాయికే ఇడ్లీ ఇస్తున్నారు. అది కూడా కట్టెల పొయ్యి మీద వండి వడ్డిస్తున్నారు. 10 రూపాయలతో 10 ఇడ్లీలు తిని కడుపునింపుకోవచ్చు. ఈ బామ్మ నిస్వార్ధ సేవపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఇడ్లీ బామ్మను అభినందించకుండా ఉండలేకపోయారు.
కమలాతాళ్.. కోయంబత్తూరులో ఈ పేరు తెలియని వారుండరేమో. రూపాయి ఇడ్లీ బామ్మ అంటే ఎవరైనా టక్కున గుర్తు పట్టేస్తారు. ప్రేమతో తయారు చేసిన ఇడ్లీ, ఆప్యాయత కలిపిన చట్నీ, ఘుమఘుమలాడే సాంబార్.. ఇవే కమలాతాళ్ హోటల్ స్పెషల్. అందుకే కిలోమీటర్ల దూరాన్ని కూడా లెక్క చేయకుండా జనం కమలాతాళ్ హోటల్పై వాలిపోతారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







