రూపాయి ఇడ్లీ బామ్మ
- September 13, 2019తమిళనాడు:ఈ రోజుల్లో చిన్నస్థాయి హోటల్కు వెళ్లినా జేబులు ఖాళీ అవుతున్నాయి.ప్లేట్ ఇడ్లీ.. తక్కువలో తక్కువ 20 రూపాయలు ఉంటుంది. కానీ ఈ 80 ఏళ్ల బామ్మ మాత్రం రూపాయికే ఇడ్లీ ఇస్తున్నారు. అది కూడా కట్టెల పొయ్యి మీద వండి వడ్డిస్తున్నారు. 10 రూపాయలతో 10 ఇడ్లీలు తిని కడుపునింపుకోవచ్చు. ఈ బామ్మ నిస్వార్ధ సేవపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఇడ్లీ బామ్మను అభినందించకుండా ఉండలేకపోయారు.
కమలాతాళ్.. కోయంబత్తూరులో ఈ పేరు తెలియని వారుండరేమో. రూపాయి ఇడ్లీ బామ్మ అంటే ఎవరైనా టక్కున గుర్తు పట్టేస్తారు. ప్రేమతో తయారు చేసిన ఇడ్లీ, ఆప్యాయత కలిపిన చట్నీ, ఘుమఘుమలాడే సాంబార్.. ఇవే కమలాతాళ్ హోటల్ స్పెషల్. అందుకే కిలోమీటర్ల దూరాన్ని కూడా లెక్క చేయకుండా జనం కమలాతాళ్ హోటల్పై వాలిపోతారు.
తాజా వార్తలు
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ
- బైట్ అల్ఘాషమ్ దార్అరబ్ ప్రైజ్ కు దరఖాస్తుల ఆహ్వానం
- ఖతార్లో అంతర్జాతీయ నగదు బదిలీపై రుసుములు పెంపు
- పాలస్తీనా భూమి ఆక్రమణ.. తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- పిల్లలకు సోషల్ మీడియా వినియోగం పరిమితం చేయాలా?
- GCC దేశాల కోసం ఇ-వీసాలు.. వ్యాలిడిలీ, డాక్యుమెంట్ ప్రాసెస్
- వార్షిక సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ డే.. లక్ష్యాలను ప్రకటించిన సౌదీ అరేబియా
- అజాన్ లేదా ప్రార్థనల పై తప్పుడు ప్రచారం.. ఖండించిన షార్జా
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు