అరామ్‌కోపై డ్రోన్‌ దాడులు: మంటలు అదుపులోకి వచ్చాయన్న సౌదీ

- September 14, 2019 , by Maagulf
అరామ్‌కోపై డ్రోన్‌ దాడులు: మంటలు అదుపులోకి వచ్చాయన్న సౌదీ

అబ్‌కాయిక్‌, ఖురైస్‌ ప్రావిన్స్‌లలోని రెండు సౌదీ అరామ్‌కో ఫ్యాక్టరీలపై డ్రోన్‌ దాడుల అనంతరం చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చాయని సౌదీ ఇంటీరియర్‌ మినిస్రీ& టఅధికార ప్రతినిథి పేర్కొన్నారు. ఈ డ్రోన్లు ఎక్కడినుంచి దాడి చేశాయన్నదానిపై ఆరా ఈస్తున్నట్లు మినిస్ట్రీ పేర్కొంది. సౌదీ అరేబియా ఈస్టర్న్‌ ప్రావిన్స్‌లోని దహ్రాన్‌కి 60 కిలోమీటర్ల దూరంలో వున్న అబ్‌కాయిక్‌ ప్రపంచంలోనే అతి పెద్ద ఆయిల్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ని కలిగి వుంది. ఖురైస్‌లోని ప్లాంట్‌ దేశంలోనే రెండో అతి పెద్ద ఆయిల్‌ ఫీల్డ్‌. కాగా, 2006లో జరిగిన దాడి యత్నాన్ని సెక్యూరిటీ ఫోర్సెస్‌ తిప్పి కొట్టాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com