చాలా బాధాకరం: ఏపీలో బోటు ప్రమాదంపై రాహుల్ ట్వీట్
- September 15, 2019
రాజమహేంద్రవరం : తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాదంపై కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఇది చాలా బాధాకరమైన సంఘటన అని, వారి కుటుంబానికి తన సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు రాహుల్ రాసుకొచ్చారు. ‘‘ఆంధ్రప్రదేశ్లోని గోదావరి నదిలో బోటు మునిగిందనే వార్త విన్నాను. నిజంగా ఇది చాలా బాధాకరం. ఈ విషాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు నేను సంతాపం వ్యక్తం చేస్తున్నాను. అంతే కాకుండా గల్లంతైన వారు తొందర్లోనే సురక్షితంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నాను’’ అని రాహుల్ ట్వీట్ చేశారు. జిల్లాలోని దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో పర్యాటక బోటు(పున్నమి) మునిగిపోయింది. ఈ ప్రమాదం సమయంలో బోటులో 67 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. గోదావరిలో వరద తగ్గడంతో అధికారులు బోటు పర్యటనకు అనుమతి ఇచ్చారు. దీంతో పున్నమి బోటు ప్రయాణికులతో పాపికొండలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







