భారత్ అమ్ములపొది కి చేరిన స్పైస్ 2000 ఇజ్రాయెల్ బాంబులు
- September 16, 2019భారత వైమానిక దళానికి మరింత బలం చేకూరింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు ఇజ్రాయెల్ దేశం నుంచి అత్యంత శక్తివంతమైన స్పైస్ 2000 బాంబులు వచ్చాయి. భారతదేశం ఇజ్రాయెల్ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా మొదటి విడత స్పైస్ 2000 బాంబులు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ లోని వైమానిక కేంద్రానికి వచ్చాయి. ఈ సరికొత్త బాంబులకు భవనాలను పూర్తిగా నాశనం చేయగల సామర్థ్యం ఉన్నాయి. ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ నుంచి మరిన్ని బాంబులు రానున్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం అత్యవసరంగా ఈ ఏడాది జూన్లో బాంబుల కొనుగోలుకు ఇజ్రాయెల్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవల భారత వాయుసేన పాకిస్థాన్ దేశంలోని బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలను స్పైస్ 2000 బాంబులతోనే పేల్చివేసింది. మిరాజ్ యుద్ద విమానాల నుంచి స్పైస్ -2000 బాంబులను వాయుసేన ఉగ్ర శిబిరాలపై వేసి ధ్వంసం చేసింది.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్