కేటీఆర్ సీఎం అవుతాడంటూ వస్తోన్న ఊహాగానాలకు బ్రేక్
- September 16, 2019హైదరాబాద్:కేటీఆర్ సీఎం అవుతాడంటూ వస్తోన్న ఊహాగానాలకు అసెంబ్లీ సాక్షిగా తెరదించారు. సీఎం కేసీఆర్. వచ్చే పదిహేనేళ్ల వరకు తానే సీఎం అంటూ తేల్చి చెప్పేశారు. తన ఆరోగ్యంపైనా క్లారిటీ ఇచ్చారాయన. 20 ఏళ్లుగా తనను రోజు చంపుతూనే ఉన్నారని సెటైర్లు పేల్చారు. తెలంగాణ రాజకీయాల్లో కొన్నేళ్లుగా వినిపిస్తున్న ప్రచారానికి.. టీఆర్ఎస్ లో ఎదో జరుగుతోందన్న పుకార్లకు సమాధానంగా కేసీఆర్ వదిలిన అస్త్రాలవి. నిజానికి కేసీఆర్ ఆరోగ్యంపైనా, ప్రభుత్వ పగ్గాల మార్పిడిపైనా ఎవేవో పుకార్లు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల సమయంలో ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటు ప్రక్రియ తర్వాత కేటీఆర్ కు పగ్గాలు అప్పగించబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది.
కేటీఆర్ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ను చేశాక ఆ ప్రచారం మరింత జోరందుకుంది. వారసుడిని సీఎం కుర్చీకి మరింత చేరువ చేసేందుకు ముందస్తు ప్రయత్నాలుగా చెప్పుకున్నారు. కానీ, అనూహ్యంగా అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఆ ప్రచారాలన్నింటిని పటాపంచలు చేస్తూ మరో పదేళ్ల వరకు నేనే సీఎంగా ఉంటానని క్లారిటీ ఇచ్చారు. తన ఆరోగ్యంపై వినిపిస్తున్న ప్రచారంపైనా స్పష్టత ఇచ్చారు.
కొద్దిరోజులుగా టీఆర్ఎస్ స్టీరింగ్ అదుపు తప్పినట్లు ప్రచారం నడుస్తోంది. గులాబీ బాస్ చెబితే ఎస్ బాస్ అనే వారి స్వరంలో అనూహ్య మార్పులు రావడమే ఇందుకు కారణమని కొందరంటున్నారు. అటు చాపకింద నీరులా గులాబీని కబలించే వ్యూహంతో బీజేపీ దూసుకొస్తోంది. ఈ సమయంలో కేసీఆర్ నాయకత్వ మార్పిడిపై స్పష్టమైన ప్రకటనతో పార్టీలో ధిక్కార స్వరాలను చల్లబరిచే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది.అటు ప్రతిపక్షాలు కేసీఆర్ ప్రకటన వెనక మరో మర్మం ఉందని అంటున్నాయి. బడ్జెట్ పై సమాధానం చెప్పాల్సిన సమయంలో అసందర్భంగా తన రాజకీయ భవిష్యత్తు గురించి చెప్పడాన్ని తప్పుపట్టారు కాంగ్రెస్ నేత విజయశాంతి. అయితే..కేటీఆర్ ను సీఎం చేయబోవటం లేదనే ప్రకటన పార్టీలో ఓ వర్గాన్ని సంతృప్తిపర్చటానికే అన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?