బహ్రెయిన్ లో పలు దేశాలకు చెందిన 19 మంది అరెస్టు..!!
- September 24, 2025
మనామా: బహ్రెయిన్ లో డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. డ్రగ్స్ రవాణాకు పాల్పడుతున్న వివిధ దేశాలకు చెందిన 19 మంది వ్యక్తులను జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ లోని యాంటీ-నార్కోటిక్స్ డైరెక్టరేట్ అరెస్టు చేసిందని తెలిపింది. నిందితుల వద్ద నుంచి మొత్తం 16 కిలోగ్రాముల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారని, వీటి విలువ 1 లక్ష 13వేల బహ్రెయిన్ దినార్ల కంటే ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. నమోదైన కేసులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు సూచించినట్టు వెల్లడించింది.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేదా ప్రమోషన్కు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని హాట్లైన్ (996) ద్వారా లేదా [email protected] కు ఇమెయిల్ ద్వారా తెలియజేయాలని కోరారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







