బహ్రెయిన్ లో పలు దేశాలకు చెందిన 19 మంది అరెస్టు..!!
- September 24, 2025
మనామా: బహ్రెయిన్ లో డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. డ్రగ్స్ రవాణాకు పాల్పడుతున్న వివిధ దేశాలకు చెందిన 19 మంది వ్యక్తులను జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ లోని యాంటీ-నార్కోటిక్స్ డైరెక్టరేట్ అరెస్టు చేసిందని తెలిపింది. నిందితుల వద్ద నుంచి మొత్తం 16 కిలోగ్రాముల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారని, వీటి విలువ 1 లక్ష 13వేల బహ్రెయిన్ దినార్ల కంటే ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. నమోదైన కేసులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు సూచించినట్టు వెల్లడించింది.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేదా ప్రమోషన్కు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని హాట్లైన్ (996) ద్వారా లేదా [email protected] కు ఇమెయిల్ ద్వారా తెలియజేయాలని కోరారు.
తాజా వార్తలు
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!









