ఆ సమయంలో కూడా నో చెప్పలేకపోయా..
- September 16, 2019దోమలు బాబూ.. దోమలు.. ఎంత జాగ్రత్తగా ఉన్నా కుట్టేస్తున్నాయ్. పరిశుభ్రంగా లేని పరిసరాల్లో మరింతగా విజృంభిస్తున్నాయి. ఆసుపత్రులన్నీ డెంగ్యూ రోగులతో నిండి పోతున్నాయి. నేనూ డెంగ్యూ బారిన పడ్డానంటూ నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ వెల్లడించారు. ఈ విషయాన్నిఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. జ్వరాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. బుల్లితెరపై ప్రసారమవుతున్న రియాల్టీ షో ఢీకు జడ్జిగా వ్యవహరిస్తున్న రేణూ.. జ్వరం నుంచి కోలుకుంటున్న సమయంలో షూటింగ్ చేయాల్సి వచ్చింది. షూటింగ్కి నో చెప్పలేకపోయానన్నారు. దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పొడవైన దుస్తులు ధరించాలని తెలిపారు. రైతుల సమస్యలను కథాంశంగా తీసుకుని రేణూ దేశాయ్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన దర్శకత్వ బాధ్యతలను ఆమె చేపట్టారు. మంచి భావుకత నిండిన కవితలను రాస్తూ రేణూ అభిమానులకు మరింత దగ్గరయ్యారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!