ఆ సమయంలో కూడా నో చెప్పలేకపోయా..
- September 16, 2019
దోమలు బాబూ.. దోమలు.. ఎంత జాగ్రత్తగా ఉన్నా కుట్టేస్తున్నాయ్. పరిశుభ్రంగా లేని పరిసరాల్లో మరింతగా విజృంభిస్తున్నాయి. ఆసుపత్రులన్నీ డెంగ్యూ రోగులతో నిండి పోతున్నాయి. నేనూ డెంగ్యూ బారిన పడ్డానంటూ నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ వెల్లడించారు. ఈ విషయాన్నిఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. జ్వరాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. బుల్లితెరపై ప్రసారమవుతున్న రియాల్టీ షో ఢీకు జడ్జిగా వ్యవహరిస్తున్న రేణూ.. జ్వరం నుంచి కోలుకుంటున్న సమయంలో షూటింగ్ చేయాల్సి వచ్చింది. షూటింగ్కి నో చెప్పలేకపోయానన్నారు. దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పొడవైన దుస్తులు ధరించాలని తెలిపారు. రైతుల సమస్యలను కథాంశంగా తీసుకుని రేణూ దేశాయ్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన దర్శకత్వ బాధ్యతలను ఆమె చేపట్టారు. మంచి భావుకత నిండిన కవితలను రాస్తూ రేణూ అభిమానులకు మరింత దగ్గరయ్యారు.
తాజా వార్తలు
- ఖలిస్థానీ ఉగ్రవాది నుంచి మోదీకి బెదిరింపులు
- మక్కా గ్రాండ్ మసీదులో గ్రాండ్ ముఫ్తీ అంత్యక్రియ ప్రార్థనలు..!!
- న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- UAE గోల్డెన్ వీసాకు H-1B వీసా బూస్ట్..!!
- కువైట్ లో ఇల్లీగల్ రెసిడెన్సీ అడ్రస్ మార్పు.. నెట్వర్క్ బస్ట్..!!
- బహ్రెయిన్ లో పలు దేశాలకు చెందిన 19 మంది అరెస్టు..!!
- ఖతార్ T100 కిక్ ఆఫ్ రన్ షెడ్యూల్ రిలీజ్..!!
- హెచ్-1బీ వీసా పెంపుతో తలలు పట్టుకుంటున్న టెక్ కంపెనీలు
- జీఎస్టీ రాయితీలపై కేంద్రం పర్యవేక్షణ
- కొత్త క్యాంపస్ ఏపీలో...12,000 కొత్త ఉద్యోగాల అవకాశాలు