హౌదీ-మోదీ: తన ప్రసంగానికి ప్రజలు సలహాలు, సూచనలు అందించాలని కోరిన మోదీ
- September 17, 2019అమెరికాలోని హ్యూస్టన్ వేదికగా జరగబోయే 'హౌదీ-మోదీ' కార్యక్రమానికి ఎంతో ఆత్రతుగా చూస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ సందర్భంగా తన ప్రసంగానికి సంబంధించి దేశ ప్రజలు సలహాలు, సూచనలు అందించాలని ట్విటర్ వేదికగా కోరారు. ''22న హ్యూస్టన్లో జరగబోయే హౌదీ-మోదీ కార్యక్రమం కోసం ఆసక్తిగా వేచిచూస్తున్నాను. ఆరోజున నేనేం మాట్లాడాలో మీ ద్వారానే తెలుసుకోవాలనుకుంటున్నాను. అందుకు సలహాలు, సూచనలు ఇవ్వండి. నా ప్రసంగంలో నేను వాటిని ప్రస్తావిస్తాను. నమో యాప్లోని స్పెషల్ ఫోరం ద్వారా మీ ఆలోచనల్ని పంచుకోండి'' అని ట్విటర్లో మోదీ కోరారు.
హ్యూస్టన్లో భారతీయ అమెరికన్లు నిర్వహించనున్న 'హౌదీ మోదీ' కార్యక్రమంలో ప్రధాని మోదీతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వేదిక పంచుకోనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు అక్కడి భారతీయ అమెరికన్లనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 50వేల మంది హాజరు కానున్నారు. అనంతరం ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో మోదీ ఈనెల 27న ప్రసంగిస్తారు.
తాజా వార్తలు
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్
- రమదాన్ ఘబ్కాను నిర్వహించిన భారత రాయబారి