ఒమన్ కుటుంబం హత్య కేసులో భారత జాతీయుడి అరెస్ట్
- September 18, 2019అహ్మదాబాద్: ఒమన్ కుటుంబాన్ని హత్య చేశాడనే అనుమానంతో ఓ భారత జాతీయుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), నిందితుడ్ని అహ్మదాబాద్లో అరెస్ట్ చేసింది. ఇంటర్నేషనల్ పోలీస్ ఛానెల్స్, ఇంటర్పోల్ ఇచ్చిన నోటీసు మేరకు భారత పోలీసు యంత్రాంగం స్పందించి, నిందితుడ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఒమన్లో వాంటెడ్ పీపుల్స్ లిస్ట్లో నిందితుడు వున్నాడు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి హత్య కేసులో నిందితుడిపై అభియోగాలున్నాయి. మృతిచెందినవారిలో 12 ఏళ్ళు, తమ్మిదేళ్ళు, ఆరేళ్ళ వయసున్న చిన్నారులూ వున్నారు. ఒమన్ అథారిటీస్, నిందితుడికి సంబంధించిన వివరాల్ని భారత పోలీసులకు అందించడంతో, నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్