హైదరాబాద్-కర్ణాటక పేరు మారింది.. ఇకపై..
- September 18, 2019హైదరాబాద్-కర్ణాటక పేరు మారింది. ఆ ప్రాంతానికి కళ్యాణ కర్ణాటక అని కొత్త పేరు పెట్టారు. ఈ మేరకు కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కీలక నిర్ణయం ప్రకటించారు. బుధవారం నుంచి హైదరాబాద్-కర్ణాటక రీజియన్ను కళ్యాణ కర్ణాటక రీజియన్గా వ్యవహరించాలని సూచించారు. కళ్యాణ కర్నాటక రీజియన్లో ప్రత్యేక సచివాలయం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
కర్నాటకలో 6 రీజియన్లు ఉన్నాయి. బెంగళూరు, ఉత్తర కర్నాటక, కోస్తా కర్ణాటక, పాత మైసూరు, హైదరాబాద్-కర్ణాటక ప్రాంతాలుగా విభజించారు. ఇందులో హైదరాబాద్-కర్ణాటక చాలా కీలకం. ఈ రీజియన్లో బీదర్, గుల్బర్గా, యాద్గిర్, రాయ్చూర్, కొప్పళ్, బళ్లారిలతో కూడిన ఈ ప్రాంతం ఒకప్పుడు నిజాం రాజ్యంలో భాగంగా ఉండేది. స్వాతంత్య్రానంతరం కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పటికీ ఈ ఆరు జిల్లాలను మాత్రం హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంగానే పిలుస్తున్నారు. దశాబ్దాల ఆ పిలుపునకు యడియూరప్ప సర్కారు చరమగీతం పాడింది.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..