ఇండియా:బ్యాంకులకు వరుసగా సెలవులు..
- September 20, 2019ఇండియా:ఈ నెలలో బ్యాంకులకు వరుసగా ఐదు రోజులు సెలవులు వచ్చాయి. ఈ నెల 26 , 27 న దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి బ్యాంకు యూనియన్లు. అలాగే 28వ తేదీ నాలుగో శనివారం బ్యాంకులకు సెలవు దినం కాగా.. 29 ఆదివారం. తిరిగి సోమవారం (సెప్టెంబర్ 30)న బ్యాంకులకు అర్ధ సంవత్సర ముగింపు రోజు. అయితే ఆ రోజూ కూడా బ్యాంకు లావాదేవీలు ఉండవు. దీంతో వరుసగా ఐదు రోజులపాటు బ్యాంకులు మూత పడనున్నాయి. ఆ తర్వాత నెల అక్టోబరు ఒకటో తేదీన బ్యాంకులు ఓపెన్ అవుతుండగా.. ఆ మరోసటీ రోజు గాంధీ జయంతి సందర్భంగా బ్యాంకులకు మళ్ళీ సెలవు ఉండనుంది. దీంతో వారం రోజుల వ్యవధిలోనే ఆరురోజుల సెలవులు బ్యాంకులకు ఉండనున్నాయి. ఐదురోజులు వరుస సెలవులు ఉండనుండటంతో ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఎక్కువ నగదు కావాలనుకునే ఖాతాదారులు నగదు కోసం బ్యాంకుల వద్ద క్యూలు కడుతున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?