టోలరెన్స్పై 250 ఆర్ట్ వర్క్స్ ప్రదర్శన
- September 21, 2019
దుబాయ్:100 మందికి పైగా ఆర్టిస్టులు ఇయర్ ఆఫ్ టోలరెన్స్ సందర్భంగా తమ ఆర్ట్ వర్క్స్ని జుమైరాలోని ప్రదర్శించారు. ఇయర్ ఆఫ్ టోలరెన్స్ ఆర్ట్ ఎగ్జిబిషన్ని 2ఎక్స్ఎల్ ఫర్నిచర్ మరియు హోడ్ డెకార్ ఏర్పాటు చేసింది. బ్రెజిల్ రాయబారి ఫెర్నాండో లూయిస్ లెమస్ ఇగ్రెజా, దుబాయ్లో ఇండియన్ కాన్సుల్ జనరల్ విపుల్, దుబాయ్ కల్చర్ మరియు ఆర్ట్స్ అథారిటీ నుంచి ఎమిరేటీ ఆర్టిస్టులు అల్రయిస్ మరియు ఖలీల్ అబ్దుల్వాహిద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాలుగు రోజులపాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. 2ఎక్స్ఎల్ ఫర్నిచర్ మరియు హోమ్ డెకార్ మార్కెటింగ్ హెడ్ అమిత్ యాదవ్ మాట్లాడుతూ, ఇండియాతోపాటు మెక్సికో, బ్రెజిల్, రష్యా, ఇరాన్ తదితర ప్రాంతాల నుంచి ఆర్టిస్టులు వచ్చారనీ, అద్భుతమైన తమ కళాకృతుల్ని ప్రదర్శించారని చెప్పారు. ఆరు నెలల క్రితమే ఆర్టిస్టులకు థీమ్ అందించారు. పీస్, టోలరెన్స్, హార్మోని విభాగాలపై ఆర్టిస్టులు తమ ఆర్ట్ వర్క్ని రూపొందించారు. పీస్ అంబాసిడర్ అయిన మహాత్మాగాంధీపై లైవ్ పెయింటింగ్ సెషన్ కూడా నిర్వహించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!