టోలరెన్స్‌పై 250 ఆర్ట్‌ వర్క్స్‌ ప్రదర్శన

- September 21, 2019 , by Maagulf
టోలరెన్స్‌పై 250 ఆర్ట్‌ వర్క్స్‌ ప్రదర్శన

దుబాయ్:100 మందికి పైగా ఆర్టిస్టులు ఇయర్‌ ఆఫ్‌ టోలరెన్స్‌ సందర్భంగా తమ ఆర్ట్‌ వర్క్స్‌ని జుమైరాలోని ప్రదర్శించారు. ఇయర్‌ ఆఫ్‌ టోలరెన్స్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ని 2ఎక్స్‌ఎల్‌ ఫర్నిచర్‌ మరియు హోడ్‌ డెకార్‌ ఏర్పాటు చేసింది. బ్రెజిల్‌ రాయబారి ఫెర్నాండో లూయిస్‌ లెమస్‌ ఇగ్రెజా, దుబాయ్‌లో ఇండియన్‌ కాన్సుల్‌ జనరల్‌ విపుల్‌, దుబాయ్‌ కల్చర్‌ మరియు ఆర్ట్స్‌ అథారిటీ నుంచి ఎమిరేటీ ఆర్టిస్టులు అల్‌రయిస్‌ మరియు ఖలీల్‌ అబ్దుల్‌వాహిద్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాలుగు రోజులపాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. 2ఎక్స్‌ఎల్‌ ఫర్నిచర్‌ మరియు హోమ్‌ డెకార్‌ మార్కెటింగ్‌ హెడ్‌ అమిత్‌ యాదవ్‌ మాట్లాడుతూ, ఇండియాతోపాటు మెక్సికో, బ్రెజిల్‌, రష్యా, ఇరాన్‌ తదితర ప్రాంతాల నుంచి ఆర్టిస్టులు వచ్చారనీ, అద్భుతమైన తమ కళాకృతుల్ని ప్రదర్శించారని చెప్పారు. ఆరు నెలల క్రితమే ఆర్టిస్టులకు థీమ్‌ అందించారు. పీస్‌, టోలరెన్స్‌, హార్మోని విభాగాలపై ఆర్టిస్టులు తమ ఆర్ట్‌ వర్క్‌ని రూపొందించారు. పీస్‌ అంబాసిడర్‌ అయిన మహాత్మాగాంధీపై లైవ్‌ పెయింటింగ్‌ సెషన్‌ కూడా నిర్వహించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com