జమ్మూలో గవర్నర్ పాలన...
- January 10, 2016
జమ్మూకాశ్మీర్ సీఎం ముఫ్తీ మహ్మద్ సయీద్ అకాల మరణంతో రాష్ట్రంలో గవర్నర్ పాలన చోటు చేసుకుంది. మూడు రోజులపాటు సంతాప దినాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో సీఎం పగ్గాలు చేపట్టేందుకు పీడీపీ అధ్యక్షురాలు, ముఫ్తీ మహ్మద్ సయీద్ కుమార్తె మెహబుబా ముఫ్తీ నిరాకరించారు. దీంతో జమ్మూలో గవర్నర్ పాలన విధించారు. మెహబుబాకు మద్దతుపై బీజేపీ తర్జనభర్జనలు ........ అయితే.. మెహబుబా ముఫ్తీకి మద్దతివ్వాలా.. వద్దా అనే అంశంపై బీజేపీ నేతలు తర్జనభర్జనలు పడినట్లు తెలిసింది. అందుకే ఆమె సీఎం పగ్గాలు చేపట్టేందుకు ఆలస్యమయ్యిందనే వార్తలు గుప్పుమన్నాయి. మరోవైపు అధికారాన్ని చేపట్టేందుకు గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా. బీజేపీ, పీడీపీకి లేఖలు రాసినా ఎవరూ ముందుకు రాకపోవడంతో తాజా పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. బాధ నుంచి మెహబుబా తేరుకోలేదంటున్న పార్టీ వర్గాలు ........ మరోవైపు తండ్రిని కోల్పోయిన బాధ నుంచి ఆమె ఇంకా తేరుకోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విషాదం నుంచి తేరుకునేందుకు మరికొంత సమయం పట్టవచ్చంటున్నారు. అప్పటివరకు గవర్నర్ పాలన కొనసాగనుందని.. ఇందులో రాజ్యాంగ సంక్షోభం ఏమీ ఉండదంటున్నారు పీడీపీ నేతలు. మెహబుబాతో బీజేపీ నేత రాంమాధవ్ భేటీ ...... ఇక ఇప్పటికే మెహబుబాతో బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ భేటీ అయ్యారు. ఆమె సీఎం పదవి చేపట్టేందుకు అంగీకరించినట్లు సమాచారం. దీంతో ఆమె రేపో, ఎల్లుండో పదవీబాధ్యతలు స్వీకరించే అవకాశం కనిపిస్తోంది. ఈమె పదవీ చేపడితే జమ్మూ కాశ్మీర్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా చరిత్ర పుటల్లోకి ఎక్కనున్నారు. ఇక మెహబుబాను పరామర్శించేందుకు సోనియాగాంధీ నేడు శ్రీనగర్ వెళ్లనున్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







