వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్: దోహాకి అథ్లెట్స్ రాక మొదలు
- September 23, 2019
ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ (ఐఎఎఫ్) వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ నేపథ్యంలో అథ్లెట్స్, స్పోర్ట్స్ అఫీషియల్స్ రావడం మొదలైంది. ఐదు రోజుల్లో ఈ మెగా ఈవెంట్ జరగబోతోంది. 209 దేశాలకు చెందిన 2,000 మందికి పైగా అథ్లెట్స్ ఈ పోటీల్లో పాల్గొంటారు. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 6 వరకు ఈ పోటీలు జరుగుతాయి. కాగా, ఖతార్ అధికార యంత్రాంగం ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసింది. ట్రాఫిక్, ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ యూనిట్స్, అథ్లెట్స్కి, వారి సహాయకులకి ఎలాంటి ఇబ్బందులూ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ పోటీల కోసం వచ్చే అథ్లెట్స్ కోసం ప్రత్యేకంగా కౌంటర్లను హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద ఏర్పాటు చేశారు. భద్రత పరంగా కనీ వినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!