వేణుమాధవ్ అంత్యక్రియలు పూర్తి…
- September 26, 2019
హైదరాబాద్: ప్రముఖ తెలుగు హాస్యనటుడు వేణుమాధవ్ అంత్యక్రియలు ముగిశాయి. నగరంలోని మౌలాలీ హౌసింగ్ బోర్డు శ్మశానవాటికలో కుటుంబసభ్యులు వేణుమాధవ్ దహన సంస్కారాలు నిర్వహించారు. అంతకుముందు మా అసోసియేషన్ ఆధ్వర్యంలో వేణుమాధవ్ భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్ ఛాంబర్ కు తరలించారు. ఫిల్మ్ చాంబర్లో వేణు మాధవ్ భౌతిక కాయాన్ని చిరంజీవి, మురళి మోహన్, రాజ శేఖర్, జీవిత, నాగబాబు, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖలు వేణు మాధవ్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.కాలేయ సంబంధిత వ్యాధితో సికింద్రాబాద్ లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం వేణుమాధవ్ కన్నుమూశారు.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!









