వేణుమాధవ్ అంత్యక్రియలు పూర్తి…

- September 26, 2019 , by Maagulf
వేణుమాధవ్ అంత్యక్రియలు పూర్తి…

హైదరాబాద్: ప్రముఖ తెలుగు హాస్యనటుడు వేణుమాధవ్ అంత్యక్రియలు ముగిశాయి. నగరంలోని మౌలాలీ హౌసింగ్ బోర్డు శ్మశానవాటికలో కుటుంబసభ్యులు వేణుమాధవ్ దహన సంస్కారాలు నిర్వహించారు. అంతకుముందు మా అసోసియేషన్ ఆధ్వర్యంలో వేణుమాధవ్ భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్ ఛాంబర్ కు తరలించారు. ఫిల్మ్ చాంబర్‌లో వేణు మాధవ్ భౌతిక కాయాన్ని చిరంజీవి, మురళి మోహన్, రాజ శేఖర్, జీవిత, నాగబాబు, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖలు వేణు మాధవ్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.కాలేయ సంబంధిత వ్యాధితో సికింద్రాబాద్ లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం వేణుమాధవ్ కన్నుమూశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com