వేణుమాధవ్ అంత్యక్రియలు పూర్తి…
- September 26, 2019
హైదరాబాద్: ప్రముఖ తెలుగు హాస్యనటుడు వేణుమాధవ్ అంత్యక్రియలు ముగిశాయి. నగరంలోని మౌలాలీ హౌసింగ్ బోర్డు శ్మశానవాటికలో కుటుంబసభ్యులు వేణుమాధవ్ దహన సంస్కారాలు నిర్వహించారు. అంతకుముందు మా అసోసియేషన్ ఆధ్వర్యంలో వేణుమాధవ్ భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్ ఛాంబర్ కు తరలించారు. ఫిల్మ్ చాంబర్లో వేణు మాధవ్ భౌతిక కాయాన్ని చిరంజీవి, మురళి మోహన్, రాజ శేఖర్, జీవిత, నాగబాబు, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖలు వేణు మాధవ్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.కాలేయ సంబంధిత వ్యాధితో సికింద్రాబాద్ లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం వేణుమాధవ్ కన్నుమూశారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







