వేణుమాధవ్ అంత్యక్రియలకు హాజరైన మేయర్ రామ్మోహన్
- September 26, 2019
హైదరాబాద్:తీవ్ర అనారోగ్యంతో మృతి చెందిన ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ అంత్యక్రియలకు నగర మేయర్ బొంతు రామ్మోహన్ తో సహా పలువురు కార్పొరేటర్లు నేడు హాజరయ్యారు. మౌలాలిలోని వేణుమాధవ్ గృహంలో ముందుగా ఆయన పార్థివ దేహానికి మేయర్ రామ్మోహన్ పూలమాలతో నివాళులర్పించారు. పలువురు ప్రజాప్రతినిధులు, సినిమా రంగానికి చెందిన ప్రముఖులు హాజరైన ఈ అంత్యక్రియల సందర్భంగా వేణుమాధవ్ నివాసం నుండి శ్మశానవాటిక వరకు నిర్వహించిన అంతిమయాత్రలో మేయర్ రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ తనకు వ్యక్తిగతంగా సన్నిహితులైన వేణుమాధవ్ మరణించడం తెలంగాణతో పాటు మొత్తం తెలుగు ప్రజానికం మంచి నటుడిని కోల్పోయిందని అన్నారు. సినీరంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను, గుర్తింపు పొందిన వేణుమాధవ్ అతిపిన్న వయసులోనే మరణించడం బాధకరమని అన్నారు.
.................................................................................................................
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









