వేణుమాధవ్ అంత్యక్రియలకు హాజరైన మేయర్ రామ్మోహన్

- September 26, 2019 , by Maagulf
వేణుమాధవ్ అంత్యక్రియలకు హాజరైన మేయర్ రామ్మోహన్

హైదరాబాద్:తీవ్ర అనారోగ్యంతో మృతి చెందిన ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ అంత్యక్రియలకు నగర మేయర్ బొంతు రామ్మోహన్ తో సహా పలువురు కార్పొరేటర్లు నేడు హాజరయ్యారు. మౌలాలిలోని వేణుమాధవ్ గృహంలో ముందుగా ఆయన పార్థివ దేహానికి మేయర్ రామ్మోహన్ పూలమాలతో నివాళులర్పించారు. పలువురు ప్రజాప్రతినిధులు, సినిమా రంగానికి చెందిన ప్రముఖులు హాజరైన ఈ అంత్యక్రియల సందర్భంగా వేణుమాధవ్ నివాసం నుండి శ్మశానవాటిక వరకు నిర్వహించిన అంతిమయాత్రలో మేయర్ రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ తనకు వ్యక్తిగతంగా సన్నిహితులైన వేణుమాధవ్ మరణించడం తెలంగాణతో పాటు మొత్తం తెలుగు ప్రజానికం మంచి నటుడిని కోల్పోయిందని అన్నారు. సినీరంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను, గుర్తింపు పొందిన వేణుమాధవ్ అతిపిన్న వయసులోనే మరణించడం బాధకరమని అన్నారు.

.................................................................................................................

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com