ఎస్బీఐ ఖాతాదారులకు గుడ్న్యూస్..
- September 27, 2019
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు శుభవార్త అందిస్తోంది. బ్యాంక్ జారీ చేసే రుణాలకు ఎక్స్టర్నల్ బెంచ్మార్క్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్ణయించింది. ఫ్లోటింగ్ రేటు ఎంఎస్ఎంఈ రుణాలు, హోమ్ లోన్స్, రిటైల్ రుణాలకు ఇది వర్తిస్తుంది. అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త రూల్ అమలులోకి వస్తుంది. మార్కెట్ వడ్డీ రేటు ప్రాతిపదికన బ్యాంకులు కస్టమర్లకు రుణాలు జారీ చేయవచ్చు. ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ ఆధారిత రుణాల జారీ విధానాన్ని వాలంటరీ ప్రాతిపదికన ఇప్పుడు ఎస్బీఐ కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. సూక్ష, స్థూల మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. ఇక రేపో ఆధారిత ఫ్లోటింగ్ రేటు హోమ్లోన్స్కు కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవి 2019 జులై 1 నుంచి అమలులో ఉన్నప్పటికీ, వాటిలో కూడా స్వల్ప మార్పులు చేసింది. అది కూడా అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానుంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు