జైపూర్-దుబాయ్ వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల వద్ద నుంచి రూ.40 లక్షల విదేశీ కరెన్సీ పట్టివేత
- September 28, 2019
జైపూర్: రాజస్థాన్ రాజధాని జైపూర్ విమానాశ్రయంలో ఇద్దరు వ్యక్తుల నుంచి సుమారు రూ. 40 లక్షలు విలువ చేసే విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. జైపూర్ నుంచి దుబాయ్ వెళ్తున్న విమానంలో మహ్మద్ షకిల్, మహ్మద్ రఫిక్ అనే ఇద్దరు ప్రయాణికులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అధికారులు తనిఖీ చేశారు. ఈ సోదాల్లో వారి వద్ద ఉన్న వేర్వేరు బాక్సుల్లో భారీ మొత్తంలో అరబ్ దేశాల కరెన్సీలైన దినార్, రియాల్, దిర్హామ్స్ దొరికాయి. వాటి విలువ దాదాపు రూ. 40 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు.నిందితులిద్దరిని విమానాశ్రయంలో దుబాయ్ విమానం ఎక్కుతుండగా పట్టుకున్నామని అధికారులు తెలిపారు.ప్రస్తుతం వారిని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!